తిరుమల : తిరుమలలో ఈనెల 13 నుంచి 22 వరకు వైకుంఠద్వార శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకోబోమని స్పష్టం చేశారు. వీఐపీలు స్వయంగా వస్తేనే వైకుంఠాద్వార దర్శన టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు. మరమ్మతుల కారణంగా వీఐపీలకు నందకం, వకుళామా వసతి భవనంలో గదులు కేటాయిస్తామని తెలిపారు.
గదులు సరిపోకపోతే తిరుపతిలో వసతి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శ్రీవాణి ట్రస్టు టికెట్ గల వారు తిరుపతిలో గదులు తీసుకోవాలన్నారు.