జగన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ నేతలకు సైకోతనం పెరిగిపోయిందని, త్వరలోనే వారి సైకతనానికి ముగింపు కార్డు పడనున్నదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్యపై వైసీపీ నేతలు తలోరకంగా మాట్లాడటాన్ని లోకేష్ తీవ్రంగా పరిగణించారు. ఆమె ఆత్మహత్య ఘటనను సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కుమార్తె చనిపోతే ఇంత నీచంగా మాట్లాడుతున్నారంటే వారి సైకోతనం ఎంతగా ముదిరిపోయిందో అర్ధం చేసుకోవచ్చునని ట్విట్టర్లో తెలిపారు.
‘టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసిన సైకో జగన్రెడ్డి తన క్రిమినల్ రూపాన్ని మరసారి బయటపెట్టుకున్నాడని, డోర్ నంబర్కు సర్వే నంబర్కు తేడా తెలియని కిరాయిగాళ్లతో మా చిన్నమ్మ మరణంపై విషప్రచారం చేయిస్తున్నాడు’ అని లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాలని సంతకాలు చేసిన నీచ చరిత్ర గలిగిన జగన్రెడ్డి.. ఎన్నికల్లో సానుభూతి కోసం బాబాయ్ మర్డర్ని వాడుకున్నారు. జనాన్ని దోచి దాచుకుని నెత్తుటి కూడు తింటూ తరతరాల రక్తచరిత్రకి వారసుడైన జగన్రెడ్డీ.. ఉమామహేశ్వరి మరణంలో మేముంటే విషప్రచారం చేస్తూ వినోదం పొందుతావా? నీ పైశాచిక ఆనందానికి ఎక్స్పైరీ డేట్ దగ్గరపడింది. మీరు చేస్తున్న పాపాలకు ఆ దేవుడి స్క్రిప్ట్ ప్రకారం శిక్ష అనుభవిస్తారు’ అని ట్విట్టర్లో రాశారు.
చిన్నమ్మ మరణంతో మేము విషాదంలో వుంటే విషప్రచారం చేస్తూ వినోదం పొందుతావా? నీ పైశాచిక ఆనందానికి ఎక్స్పెయిరీ డేట్ దగ్గర పడింది. మీరు చేస్తున్న పాపాలకు ఆ దేవుడి స్క్రిప్ట్ ప్రకారం శిక్ష అనుభవిస్తారు.(4/4)#FakeJagan#YSRCPcheapPolitics
— Lokesh Nara (@naralokesh) August 3, 2022