అమరావతి : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 13న తిరుపతికి అమిత్ షా రానున్నారు. 14న ఉదయం నెల్లూరులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో నిర్వహించే సదరన్ జోనల్ సీఎంల సమావేశంలో కేంద్ర హోంమంత్రి పాల్గొననున్నారు. 15న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.