హైదరాబాద్, జూలై 5 (నమస్తే తె లంగాణ): ఉమ్మడి పౌరస్మృతిపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ, జనసేన పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని కోరారు.
ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి గురించి దేశమంతటా చర్చ జరుగుతున్నదని, కానీ దీనిని మొదట తీసుకొచ్చింది మాత్రం బీజేపీ కాదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లోనే అది ఉన్నట్టు పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని, అందుకే పార్టీలు తమ వైఖరిని ప్రజలకు వెల్లడించాలని తెలిపారు.