అమరావతి : కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్లో తెప్ప తిరగబడి గల్లంతైన వారిలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామ పరిధిలోని బ్యాక్వాటర్లో ముగ్గురు తెప్పపై వెళ్తుండగా గాలులకు తెప్ప తిరగబడింది. దీంతో నీట మునిగి సుహాసిని (32), గోవర్ధన్ రెడ్డి (29) మృతి చెందారు. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. దీంతో బ్యాక్ బాటర్లో ఎవరూ విహరించకుండా అధికారులు పోలీసు నిఘా ఏర్పాటు చేశారు.