అమరావతి : ఏపీలోని విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం వద్ద రహదారిపై రెండు కార్లు ఢీకొన్న సంఘటనలో ఒక కారు దగ్దమయ్యింది. విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న కారును అదే మార్గంలో వస్తున్న మరోకారు ఢీ కొట్టింది . కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు కుటుంబ సభ్యులకు తృటిలో ప్రమాదం తప్పింది. కారులో మంటలు చెలరేగిన వెంటనే వారు బయటకు రావడంతో ప్రమాదం తప్పింది.
నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయగా అప్పటికే కారు మొత్తం దగ్ధమయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.