అమరావతి : విహారయాత్రకు బయలు దేరిన విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతైన విషాదఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా యాడికిలోని పెన్నా సిమెంట్స్ కళాశాలకు చెందిన సుమారు 22 మంది విద్యార్థులు (Students) రెండు రోజుల క్రితం విహారయాత్రకు బయలు దేరారు. శనివారం తమిళనాడులోని మహాబలిపురాని(Mahabalipuram) కి చేరుకుని సముద్రతీరానికి చేరుకున్నారు. కొంత మంది విద్యార్థులు సముద్రంలోకి దిగగా ఇద్దరు ప్రమాదవశాత్తు అలల తాకడికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక గజ ఈతగాళ్ల సహాయంతో గల్లంతైన విద్యార్థులు శేషారెడ్డి, పెద్దిరాజు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.