తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శించుకునే భక్తులకు శుభవార్త. నేడు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. బ్రహ్మోత్సవాలు జరిగే రోజులు మినహా మిగిలినరోజులకు ఈ టికెట్లు ఇవ్వనుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు సర్వదర్శనం మినహా మిగిలిన దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.