తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. వీటితోపాటు వసతి గదులను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఈనెల 23 నుంచి 28వ తేదీకి సంబంధించిన ఈ టికెట్లను టీటీడీ వెబ్సైట్, యాప్లో బుక్ చేసుకోచ్చు.
అదేవిధంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు గల శ్రీవారి ఆర్జిత సేవాటికెట్ల ఆన్లైన్ డిప్లో పాల్గొనేందుకు భక్తులు బుధవారం ఉదయం 10 నుంచి శుక్రవారం (ఈ నెల 10) ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇక, ఈ నెల 22 నుంచి 28వ తేదీకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను బుధవారం మధ్నాహ్నం 12 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్ కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నది.