TTD | శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో సోమవారం విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ ఆన్లైన్లో ఉంచింది. రోజుకు 10 వేల టిక్కెట్ల చొప్పున జనవరి నెలకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. అయితే సైట్లో విడుదల చేసిన 15 నిమిషాల్లోనే ఈ టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. మరోవైపు, జనవరి 13 నుంచి 22 తేదీ వరకు మాత్రం కేవలం 5 వేల టిక్కెట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది. వైకుంఠ ఏకాదశి ఉన్నందునే ఇలా చేసినట్లు తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా టీటీడీ ఆన్లైన్లోనే టిక్కెట్లను ఉంచుతోన్న విషయం విదితమే.