Tirumala | హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లగేజీ విధానంలో ఆధునిక మార్పులు తెచ్చింది. లగేజీ కేంద్రాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు టీటీడీ సెక్యూరిటీ, దాతల సహకారంతో కొత్త సాఫ్ట్వేర్ను తీర్చిదిద్దింది. లగేజీ సెంటర్కు బాలాజీ బ్యాగేజ్ సెంటర్గా నామకరణం చేసింది. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ..
ఇప్పటి వరకు కాలిబాటలో వచ్చే భక్తుల లగేజీని తిరుపతిలో తీసుకొని తిరుమలలో మాన్యువల్గా ఇచ్చే విధానం ఉండేదని చెప్పారు. ఎయిర్పోర్ట్ తరహాలో భక్తులకు సేవలు అందించేందుకు కొత్త సాప్ట్వేర్ను రూపొందించామని తెలిపారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్, రూ.300 ప్రత్యేక దర్శనం, శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్ల మార్గంలో ఈ ఉచిత కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. లగేజీ కేంద్రాల్లో టికెట్ స్కాన్ చేయగానే భక్తుల లగేజీ ఎక్కడ ఉన్నదో పూర్తి వివరాలు తెలుస్తాయని, దాంతో లగేజీని భక్తులకు అందజేస్తామని ఈవో వెల్లడించారు.