తిరుమల : తిరుమలలోని ఏడుకొండస్వామి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. గతంలో మున్నెన్నడు లేనివిధంగా మేనెలలో రూ. 139 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సుమారు 22.62లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని వివరించారు. కాగా భక్తుల సౌకర్యార్ధం టైంస్లాట్ సర్వదర్శన విధానం పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
సమస్యలు తలెత్తకుండా తిరుపతిలో టైంస్లాట్ టోకెన్లు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని త్వరలో వీటిని భక్తులకు జారీ చేస్తామని వివరించారు. 2019లో టీటీడీ పథకాలకు 308 కోట్లు రాగా 2021లో రూ.564 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు.