తిరుమల: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. రథసప్తమి పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ సందర్భంగా ఆలయంలో వాహనసేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు.