హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షంచుతామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తులకు డిసెంబర్ 23 నుంచి 2024 జనవరి 1వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.
తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల కౌంటర్లలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకు 4.25 లక్షల టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లను డిసెంబర్ 22న విడుదల చేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు చంటిపిల్లలు, దివ్యాంగులు, వయోవృద్దులు, ఎన్ఆర్ఐల దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు.