తిరుపతి : తిరుచానూరులో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవకుండాత్మక శ్రీయాగానికి రావాలని కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామిని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు ఆహ్వానించారు. కంచి మఠంలో పీఠాధిపతిని కలిశారు. 50 సంవత్సరాల తరువాత తిరుచానూరులో నవకుండాత్మక శ్రీయాగం నిర్వహిస్తున్నట్టు వారు వివరించారు. శుక్రవారం ప్రారంభమైన ఈ యాగంలో చివరిరోజైన జనవరి 27న పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.