తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తడంతో సర్వదర్శనం స్లాట్ విధానాన్ని రద్దు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. కరోనాకు ముందున్న విధాన్ని తిరిగి ప్రవేశపెడుతున్నామని చెప్పారు. వైకుంఠంలో వేచివున్న భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రద్దీవల్ల 20 నుంచి 30 గంటల పాటు వేచిఉండాల్సి వస్తున్నదని చెప్పారు. వైకుంఠం-2, క్యూలైన్లను ఆయన పరిశీలించారు.
కాగా, టికెట్లు లేకుండా వచ్చేవారితో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం-2 వెలుపల క్యూలైన్లలో భక్తులు బారులు తీరుతున్నారు. టికెట్లు లేకుండా నేరుగా వచ్చిన భక్తులకు నేటినుంచి దర్శనం కల్పించనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో మూడు రోజులపాటు ఆర్జిత సేవలను టీటీడీ నిలిపివేసింది. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దుచేసింది.