తిరుమల: తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అధికారులతో కలిసి బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా దాతల సహకారంతో శిలాతోరణం,పద్మావతి విశ్రాంతి భవనాల సముదాయం,హెచ్విసి, బాలాజీ నగర్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న13 విశ్రాంతి భవనాల పనుల పురోగతిని పరిశీలించి, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం సిఆర్వో, ఆర్టిసి బస్టాండ్ ఎదురుగా మరింత మెరుగైన పారిశుద్ద్య పనులు చేపట్టాలని ఆరోగ్య విభాగం అధికారులకు సూచించారు. అంతకుముందు సిఆర్వో వద్ద టిటిడి అందిస్తున్న సౌకర్యాలను గురించి ఆయన భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.