అమరావతి : అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తుండడంతో ఓ ప్రయాణికుడు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జోగేశ్ బెహరా(70) అనే వృద్ధుడు కొంతకాలంగా గుండెజబ్బుతో బాధ పడుతున్నాడు.
అతడికి మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు రైలులో విశాఖకు తీసుకువస్తుండగా అగ్నిపథ్ అల్లర్లు జరగడంతో విశాఖకు వస్తున్న రైళ్లను కొత్తవలసలో గంటల తరబడి నిలిపి వేశారు. దీంతో జోగేశ్ బెహరా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో కొత్తవలసలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.