అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లా (Prakasam District) యర్రగొండపాలెంలో విషాదం నెలకొంది. ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మరణించారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో యర్రగొండపాలెం గ్రామంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ నీటి గుంట వద్దకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి నీటిగుంటలో పడిపోయారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటినా నీటి గుంటలో గాలించగా శివాజి(8), నాగసాయి(10) మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.