అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లాలో రెండు ఆర్మీ కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలోని చెక్డ్యామ్లో ఈతకు వెళ్లిన ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు నీటమునిగి గల్లంతయ్యారు. పూసలపాడు గ్రామానికి చెందిన కర్నాటి రామచంద్రారెడ్డి మృతదేహం లభ్యం కాగా మరో వ్యక్తి శివకోటిరెడ్డి కోసం చెక్డ్యాంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.