అమరావతి : విద్యార్థుల విహార యాత్ర ఇద్దరు విద్యార్థుల కుటుంబాల్లో విషాదం నింపింది . ఈతకు దిగిన విద్యార్థుల్లో ఇద్దరు నీటి ప్రవాహనికి కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో జరిగింది. మధిరలోని సరస్వతీ విద్యాలయానికి చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి విహారయాత్రకు బయలు దేరారు.
మార్గమధ్యలో పెనుగంచిప్రోలు మున్నేరువాగులో స్నానానికి దిగిన విద్యార్థుల్లో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరిని ఉపాధ్యాయులు కాపాడారు. మృతులు ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన శీలం నర్సిరెడ్డి(12), నీలం జశ్వంత్(12 )గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.