అమరావతి : బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజాంపట్నం వద్ద బోటులో సుమరు 40 మంది సభ్యులు గల ఓ కుటుంబం సముద్ర స్నానానికి వెళ్లారు. ఒక్కసారిగా బోటు అలల తాకిడికి గురి కావడంతో బోటులో ఉన్న సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ తోపులాటలో బోటులో ఉన్న నలుగురు చిన్నారులు సముద్రంలో పడి గల్లంతయ్యారు.
గల్లంతైన చిన్నారిలో ఫాజియా సుల్తానా అనే చిన్నారి మృతదేహం లభ్యమైంది. మరో బాలుడిని రక్షించగా అతడి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలిస్తున్నారు.