కృష్ణా: ఆంధప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ రవాణా రానురాను పెరిగిపోతున్నది. ప్రభుత్వం, పోలీసులు స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ.. కొత్త ఆలోచనలతో అక్రమ రవాణా జరుపుతున్నారు. స్మగ్లర్ల ఆటకట్టించడం ఏపీ పోలీసులకు కత్తిమీది సాముగా మారిందని చెప్పుకోవాలి. ఒకవైపు ఎర్రచందనం, గంజాయి అక్రమ రవాణాకు అడ్డగా మారగా.. ఇప్పుడు వన్యప్రాణులను స్మగ్లింగ్ చేయడంలో పైచేయి సాధించారు. తాజాగా తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తూ స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడ్డారు.
కైకలూరు నుంచి తాబేళ్లను అక్రమంగా తరలిస్తుండగా స్మగ్లర్లు అడ్డంగా బుక్కయ్యారు. గోనె సంచుల్లో సరుకులు, వస్తువులను మనం సాధారణంగా తరలిస్తుంటా. అదేరీతిన తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తే ఎలాంటి అనుమానం రాదని ఆలోచించిన స్మగ్లర్లు.. ఇలా కొత్తు ఎత్తుగడ వేశారు. తాబేళ్లను గోనె సంచుల్లో నింపి కుట్టి తరలించేందుకు ప్రయత్నించారు. తనిఖీల్లో భాగంగా వాహనాన్ని చెక్ చేసిన పోలీసులకు.. గోనె సంచులు కదలడంతో అనుమానం వచ్చి ఆరా తీశారు. గోనె సంచులను విప్పి చూసి పోలీసులు షాక్ అయ్యారు. 25 గోనె సంచుల్లో 500 తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మినీ వ్యాన్ డ్రైవర్తో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.