అమరావతి: డిగ్రీ కళాశాలల్లో 2021- 22 విద్యా సంవత్సరం అడ్మిషన్ల గడువు రేపటితో ముగియనున్నది. ఆఖరి రోజని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ప్రకటన జారీ చేశారు. మూడో విడత అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 12వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. రేపటి వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వెబ్ ఆప్షన్ల లో నమోదు చేసుకున్న వారికి 17వ తేదీన సీట్ కేటాయింపు జరుగుతుందని, 18 నుంచి 20వ తేదీ వరకు ఆయా కళాశాలలో చేరడానికి అవకాశం ఉందని ఆమె చెప్పారు.