హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం నిర్వహించనున్నట్టు రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ మనీశ్కుమార్ సిన్హా తెలిపారు. ఉదయం 10 గంటలకు మొదటి పేపర్, 2.30 గంటల నుంచి రెండో పేపర్ పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్షకు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు. నిమిషం ఆలస్యమైనా, మొబైల్, ల్యాప్టాప్, బ్లూటూత్, పెన్డ్రైవ్, స్మార్ట్వాచ్, క్యాలిక్యులేటర్, లాగ్ టేబుల్, పర్స్లను వెంట తెచ్చుకున్నా అనుమతించబోమని తెలిపారు. అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు. 411 ఎస్ఐ పోస్టులకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నారు.