తిరుమల : తిరుమల(Tirumala)లో శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శనివారం కోటి రూపాయలు(One Crore) విరాళంగా అందించారు.హైదరాబాద్కు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా(SRC Infra) ప్రైవేట్ లిమిటెడ్ తరపున ఎవికె.ప్రసాద్, ఎవి ఆంజనేయ ప్రసాద్ విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ(Ttd) చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు సనత్ కుమార్ పాల్గొన్నారు.
శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం..
తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోగా భక్తులు (Devotees)ఎన్జీఆర్హెచ్ షెడ్ల వరకు క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 36 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు(TTD Officials) వెల్లడించారు. నిన్న స్వామివారిని 66,310 మంది భక్తులు దర్శించుకోగా 31,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Income) రూ . 3.16 కోట్లు వచ్చిందని తెలిపారు.