తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో స్వామిదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు. నిన్న 74,617 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 32,752 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.67 కోట్లు వచ్చిందన్నారు.