తిరుమల : తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయి శిలాతోరణం(Shilatoranam) వరకు లైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటలల్లో సర్వదర్శనం(Sarvadarsanam) అవుతుందని ఆలయ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 62,005 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 34,127 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.75 కోట్లు వచ్చిందని తెలిపారు.
షోడశదిన కిష్కిందకాండ పారాయణదీక్షకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
టీటీడీ చేపట్టిన షోడశదిన కిష్కిందకాండ పారాయణదీక్షకు తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా సంకల్పం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, రుత్విక్ వరణం, అంకురార్పణ చేపట్టారు. 16 రోజుల పాటు నిష్ణాతులైన వేద పండితులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.