అమరావతి : ఏపీలోని కడప ( Kadapa ) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ ఫిలిం ( Shooting Short Film) షూట్ చేస్తుండగా ముగ్గురు యువకులు నీట మునిగి చనిపోయారు. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు ఇన్స్టా ద్వారా పరిచయమై షార్ట్ ఫిలిమ్స్పై ఆసక్తితో సాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ సంద్భంగా కడప జిల్లాలోని వల్లూరు మండలం పుష్పగిరి గ్రామ పరిధిలో ఉన్న పెన్నా నది వద్ద షార్ట్ ఫిలిం చిత్రీకరిస్తుందగా ప్రమాదవశాత్తు ముగ్గురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా హరిబాబు ( 25), హర్షవర్ధన్ ( 22) మృతదేహాలు లభ్యమయ్యాయి. కృష్ణ చైతన్య కోసం గాలింపు చర్యలను చేపట్టారు .