తిరుపతి : గణేశ్ ఉత్సవాల ప్రారంభం రోజున తిరుపతి జిల్లా కేవీబి పురం మండలంలో మైనర్పై లైంగిక దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను శ్రీకాళహస్తి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వెట్టి సెల్వం అలియాస్ సెల్వరాజ్ అతడికి సహకరించిన గుణశేఖర్, అశోక్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
ఘటన జరిగిన తరువా త నిందితులను గుర్తించడానికి మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. లక్షీపురం గ్రామ సర్కిల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరం అంగికరించారని వెల్లడించారు. నిందితులపై పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.