అమరావతి : లారీ డ్రైవర్ అజాగ్తత్త కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ను ఢీ కొట్టి మూడుకిలోమీట్లర్ల దూరం వరకు లాకెళ్లడంతో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారిపై బైక్పై ముగ్గురు వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ వారిని ఢీ కొట్టింది. అయితే లారీ యజమాని ఇదేమి గమనించకుండానే దాదాపు మూడుకిలోమీటర్ల దూరం వరకు వెళ్లగా వెనుక నుంచి వచ్చిన ఇతర వాహనదారులు లారీ డ్రైవర్కు విషయం చెప్పడంతో వాహనాన్ని లారీని ఆపి ప్రమాదాన్ని గుర్తించాడు.
ఈ ప్రమాదంలో మరణించిన వారు ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి వాసులుగా గుర్తించినట్లు సమాచారం . పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.