విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. పెందుర్తి సమీపంలోని అక్కిరెడ్డిపాలెం వద్ద టాటా ఏస్ వ్యాన్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను విశాఖలోని కేజీహెచ్కు తరలించారు.
మృతులను ఇందు, హనుమంతు ఆనంద్, హనుమంతు చంద్రశేఖర్గా గుర్తించారు. బాధితంలా ఏలూరు జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుమెట్ట రామకృష్ణ కాలనీకి చెందినవారని, శ్రీకాళం జిల్లా పొందూరులో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.