అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై వేల సంఖ్యలో అభ్యంతరాలు, సూచనలు వచ్చాయని ఏపీ ప్రణాళిక కార్యదర్శి విజయ్కుమార్ వెల్లడించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. విజయనగరంలో 4,500, కృష్ణలో 2,800, కడపలో 1,300 తదితర జిల్లాలో వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని వివరించారు. అంశాల వారీగా పరిశీలిస్తే దాదాపు 60 వరకు అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి రేపు ఏపీ సీఎం జగన్కు నివేదిస్తామని స్పష్టం చేశారు.
లోక్సభ నియోజకవర్గం యూనిట్గా జిల్లాల ఏర్పాటు చేయాలనే ప్రాతిపదికన కొన్ని జిల్లాలో సమస్యలు ఎదురయ్యాయని అన్నారు. ప్రజల ఆకాంక్షలను పూర్తి చేసే విధంగానే తుది మార్పులు ఉంటాయని ఆయన వివరించారు. సహేతుకమైన సమస్యలను పరిగణనలోకి తీసుకునే అవకాశంముందన్నారు.
ఈ నెల మూడో వారంలో తుది నోటిఫికేషన్ వెలువడుతుందని ఆయన చెప్పారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల విభజన శాశ్వత ప్రాతిపదికకు మరో రెండేళ్లు పడుతుందని వెల్లడించారు.