తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొవిడ్ నిబంధనల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 27,895 మంది భక్తులు దర్శించుకోగా 13,631 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా హుండీ ఆదాయం రూ .3.48 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.