అమరావతి : రైళ్లలో ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తూ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యులు గల ముఠా ఇటీవల కాలంలో పలు రైళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారని రైల్వే ఎస్పీ విశాల్ గుప్తా తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 60లక్షల విలువ చేసే 1300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
మంగళగిరిలోని పూజ బంగారు దుకాణానికి చెందిన బంగారం చోరీకి గురయ్యిందని తెలిపారు. దుకాణంలో పనిచేసే నరేంద్ర, ఓంకార్ చోరీకి పథకం పన్నారని పేర్కొన్నారు. రైళ్లల్లో ప్రయాణించే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.