అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై అసత్యప్రచారాలు చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా గణేశ్ మండపాలకు అనుమతులు లేవంటూ రెచ్చగొట్టె ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సభలు, సమావేశాల నిర్వహణకు ఎవరైనా మైక్ పర్మిషన్ కోసం వంద రూపాయలు, ఫైర్ సేఫ్టీకి రూ. 500 చలానా కట్టాలని అదే పద్ధతిలో గణేశ్ మండపాలు కూడా చలానా కట్టాలని తెలిపారు. ఇది ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం కాదని ఎప్పటి నుంచే ఉన్న విధానమని పేర్కొన్నారు. దేవుణ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సరైనది కాదని ఆయన తెలిపారు.