తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి వెలసిన తిరుమల ( Tirumala ) పుణ్యక్షేత్రంలో జనవరి ( January ) నెలలో జరిగే విశేష కార్యక్రమాలను టీటీడీ (TTD) అధికారులు ప్రకటించారు. జనవరి 9న చిన్న శాత్తుమొర, 10న వైకుంఠ ఏకాదశి, స్వర్ణ రథోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ( Vaikuntha Dwara Darshanam) ప్రారంభం, 11న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానం పర్వదినాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
15వ తేదీన ప్రణయ కలహోత్సవం గోదా పరిణయం, 17న తిరుమళిసై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 18న శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం, 19న పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం నిర్వహిస్తున్నట్లు వివరించారు. 20న శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 23న అధ్యాయనోత్సవాలు సమాప్తం, 24న తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు, 25న సర్వ ఏకాదశి, 26న గణతంత్ర దినోత్సవం, 27న మాస శివరాత్రి, 29న శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.