అమరావతి : ఎన్నికలకు ముందు రేవంత్ను దూషించిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) వెనుక రాజకీయ దురుద్దేశం దాగి ఉందని మంత్రి రోజా(Minister Roja) ఆరోపించారు. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రేవంత్ (CM Revanth) అవినీతిపరుడు, ఆయన్ను ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని ఆరోపించిన షర్మిల ఆయన్ను ఎందుకు కలిసిందిని ప్రశ్నించారు.
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు చంద్రబాబు రాసిచ్చిన స్రిప్ట్ (Chandra babu Script) నే పవన్కల్యాణ్, వైఎస్ షర్మిల చదువుతూ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ఏపీ ప్రజలకు మంచి చేస్తున్న జగన్పై షర్మిల విమర్శలు చేయడం వెనుక చంద్రబాబును గద్దె ఎక్కించాలనే లక్ష్యం కనబడుతుందని విమర్శించారు.
ప్రజలకు మంచి చేయాలనే తపన, పౌరుషం షర్మిలకు లేవని, వైఎస్కు నిజమైన వారసుడు జగనేనని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మాత్రమే షర్మికు గుర్తింపు తప్పా రాష్ట్రాంలో ఆమెను ఎవరూ గుర్తించరని అన్నారు. తెలంగాణలో పార్టీని స్థాపించి అక్కడా ప్రజలు గుర్తించకపోతే తిరిగి తాను ఏపీ బిడ్డను అంటూ రాజకీయం చేస్తుందని విమర్శించారు.