అమరావతి : నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారాన్ని హైకోర్టు సీరియస్గా తీసుకోవాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కోరారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఏ1 గా ఉన్న కేసులో పత్రాల చోరీ జరగడం కుట్రలో భాగమేనని ఆయన వెల్లడించారు. కేసులో నిందితుల బెయిల్ రద్దు చేసి కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు . కోర్టులో చోరీ ఘటనలను ఆదిలోనే అరికట్టాలని అన్నారు. లేదంటే భవిష్యత్తులో నేరగాళ్లంతా ఇలాగే ప్రవర్తించే ప్రమాదముందని పేర్కొన్నారు.
కోర్టులో చోరీ ఘటన ఆధారాల ధ్వంసం కిందకు వస్తుందని తెలింపారు. కోర్టులో చోరీ దేశంలో ఎక్కడా జరగలేదని ఆరోపించారు. ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.