తిరుపతి: ప్రపంచ శాంతి,సౌభాగ్యం కోసం లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ జనవరి 21నుంచి 27వ తేదీ వరకు ఏడు రోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీయాగం జరగనున్నది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో ఏకాంతంగా ఈ యాగం నిర్వహించనున్నారు.
ఈ యాగానికి ప్రధానాచార్యులుగా అర్చకులు పి.శ్రీనివాసన్ వ్యవహరిస్తారు. యాగంలో భాగంగా రేపు సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు విష్వక్సేనా రాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.