తిరుమల : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చీఫ్ ఇంజినీర్ను ఆదేశించారు. మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాలను గురువారం ఆయన పరిశీలించారు. వైకుంఠ ఏకాదశిలోపు పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలకు అనుమతించాలని సూచించారు. వర్షానికి పెద్ద బండరాళ్లు పడినా స్వామివారి దయవల్ల ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. పడిన బండరాళ్లను పూర్తి స్థాయిలో తొలగించామని, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.
ఐఐటీ నిపుణుల సూచనల మేరకు ఇంకా బండరాళ్లు పడే ప్రాంతాలను గుర్తించి జాగ్రత్త చర్యలు తీసు కుంటున్నట్టు తెలిపారు. ఈ పనులన్నింటినీ ఈ నెలాఖరుకు పూర్తి చేసి రెండో ఘాట్ రోడ్డును భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. చైర్మన్ వెంట టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్రెడ్డి, వీజివో బాలిరెడ్డి, ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ ఈఈ రమణ తదితరులు ఉన్నారు.