హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిపాదనను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తిరుపతి నగరాభివృద్ధికి టీటీడీ బడ్జెట్లో ఒక శాతం నిధులు కేటాయించాలన్న టీటీడీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు టీటీడీ ఈవోకు దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ మెమో ఇచ్చారు.
ఇటీవల జరిగిన టీటీడీ ధర్మకర్తల మడలి సమావేశంలో టీటీడీ వార్షిక బడ్జెట్లో ఒక శాతం కేటాయించి ఓ ప్రత్యేక నిధి ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ ధార్మిక సంస్థల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఈవోను ఆదేశించింది.