అమరావతి : ఏపీలోని కాకినాడ అన్నవరంలో వెలసిన సత్యదేవుణ్ని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్, అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పెనూఖండు ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, ఎగ్జిక్యూటీవ్ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు నేపాల్ ప్రధాని, సీఎంతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాలువాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.