అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా, తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన ఓ ప్రేమ జంట వివాహం చేసుకుంది. అయితే వారి ముచ్చట తీరకముందే నవ వరుడు మృతి చెందడంతో వరుడి ఇంటా విషాదం నెలకొనిఉన్నది. అన్నమయ్య జిల్లా పాకాల మండలం కట్టకిందిపల్లి గ్రామానికి చెందిన తులసీప్రసాద్ అనే యువకుడు హైదరాబాద్కు చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరు సోమవారం అన్నమయ్య జిల్లాలో ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు.
జిల్లాలోని మదనపల్లె చంద్రశేఖర్ కాలనీలో నివాసముంటున్నారు. నిన్న రాత్రి వరుడు తులసీ ప్రసాద్ తీవ్ర అస్వస్థకు గురి కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించే లోగా మృతి చెందడంతో వరుడి ఇంట్లో విషాదం నెలకొన్నది. వరుడు మృతికి గత పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వరుడి బంధువులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.