అమరావతి : అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఫైనాన్సియర్ గుడిమెట్ల ఆదిత్యరెడ్డిపై దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. అతడిపై నాటుబాంబులు , గన్తో దాడికి యత్నించి విఫలమయ్యారు. ఆదిత్యరెడ్డి ప్రతిఘటించడంతో గన్ మిస్ఫైర్ అయ్యింది. తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
ఘటనా స్థలానికి వచ్చిన జనాలను చూసి దుండగులు వెంట తీసుకొచ్చిన బ్యాగ్ అక్కడే వదిలవేసి పారిపోయారు. బ్యాగును పరిశీలించగా రెండు నాటుబాంబులు లభించడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు రావులపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు.