HomeAndhrapradesh-newsThe Death Toll In The Train Accident At Kantakapalli In Vizianagaram District Has Risen To 16
16కు చేరిన రైలు ప్రమాద మృతులు
విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 16కి పెరిగింది. మరో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇద్దరు లోకో పైలట్లు, గార్డు మృతి
ముమ్మరంగా పునరుద్ధరణ చర్యలు
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 16కి పెరిగింది. మరో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లు, గార్డు మృతి చెందారు. ఇప్పటి వరకు 13 మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీశాయి. ఘటనా స్థలంలో పునరుద్ధరణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ప్రమాదానికి గురైన బోగీలను ట్రాక్పై నుంచి తొలగించి అక్కడి నుంచి తరలించారు. ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద స్థలిని సందర్శించిన ఏపీ సీఎం జగన్ అనంతరం దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. రైలు ప్రమాదం కారణంగా 33 రైళ్లను రద్దు చేయగా, మరో 6 రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. 24 రైళ్లను దారి మళ్లించామని, 11 రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని చెప్పారు.
కేంద్రం వైఫల్యం: తోట చంద్రశేఖర్
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరగటం దురదృష్టకరమని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేరొన్నారు. మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రైలు ప్రమాదాలను నివారించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.