అమరావతి : విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ కోర్టు(Visakha Court) సంచలన తీర్పునిచ్చింది. 27 ఏడేండ్ల నాటి శిరోముండనం కేసులో వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు(MLC Thota Trimurthulu) 18 నెలల జైలు(Jail) శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..1996 డిసెంబర్ 26న వెంకటాయపాలెంలో ఇద్దరు దళితులకు శిరోముండనం చేసి, ఐదుగురు దళితులను చిత్ర హింసలకు గురి చేశారు. అనేక మందిని విచారించిన అనంతరం దోషిగా తేలడంతో త్రిమూర్తులుతో పాటు మరో 9 మంది నిందుతులకు కోర్టు శిక్షలు ఖారారు చేసింది. తోట త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.