అమరావతి : అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. 30 మంది గల ప్రయాణికుల బస్సు ఒక్కసారిగా వాగులో చిక్కుకు పోవడంతో స్థానికులు సురక్షితంగా బస్సును ఒడ్డుకు చేర్చారు. అనంతపురం జిల్లా గుత్తి నుంచి బళ్లారి వెళ్తున్న ఆర్టీసి బస్సు డోనెకల్ వాగులో ఒక్కసారిగా వచ్చిన ప్రవాహనికి నిలిచి పోయింది. బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును ముందుకు కదపకుండా అక్కడే ఉంచడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ట్రాక్టర్ సహాయంతో బస్సును ఒడ్డుకు చేర్చి ముప్పై మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.