అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కారం (Guntur kaaram) సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అన్ని థియేటర్లలో టికెట్పై రూ.50 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది . ఈ నెల 12 నుంచి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
మహేశ్బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్లో వస్తోన్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
కాగా ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం( Telangana Government) సైతం అంగీకరించిన విషయం తెలిసిందే. సింగిల్ స్క్రీన్స్లో రూ. 65 , మల్లీఫ్లెక్స్లలో రూ.100 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ నెల 12 అర్థరాత్రి ఒంటిగంట నుంచి తెలంగాణలోని 23చోట్ల బెనిఫిట్ షోల ప్రదర్శనకు కూడా పర్మిషన్ ఇచ్చింది. వీటితో పాటు ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం నాలుగు గంటల షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.