అమరావతి : తెలంగాణలోని కొత్త గూడెం జిల్లా మణుగూరు పీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న షేక్ సుభాన్ అనే కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల విజయవాడకు వెళ్లిన కానిస్టేబుల్ అక్కడి నుంచి భార్యకు ఫోన్ చేసి తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచారని వివరించాడు.
అనంతరం అతడి వద్ద నుంచి సమాచారం రాకపోవడంతో విజయవాడకు వెళ్లిన కానిస్టేబుల్ భార్య పోలీసులను సంప్రదించింది. ఈనెల 10న షేక్ సుభాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని , కేసు నమోదు చేసినట్లు ఏపీ పోలీసులు వివరించారు. ఈ కేసుపై అనుమానం ఉండడంతో మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.